Sunday, December 16, 2007

నాయాపూల్ ఆసుపత్రిలో జూ.డా.ల ఫై జరిగిన దాడిని నిరసిస్తూ

నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం ఇంకా మరచిపోక ముందే మళ్లీ జూ.డా.ల ఫై నయపూల్ ఆసుపత్రిలో దాడి జరిగింది.అసలు ఏం జరుగుతుంది.
చెయ్యెత్తి దండం పెట్టవలసిన వైద్యుల ఫై ప్రత్యక్ష దాడులకు దిగడం భాధాకరం.ప్రజల యొక్క మనోభావాలు ఎలా మారుతున్నాయి?చిన్న సమస్య సైతం కొన్ని స్వార్ధాపర శక్తుల ప్రవేశంతో జటిలం అవుతున్నాయి.సమాజంలో జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఇటు ప్రభుత్వం,న్యాయ వ్యవస్త ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి.న్యాయస్థానం ఆదేశాల మేరకు విధుల్లోకి హాజరయిన జూ.డా.లకు
తగిన రక్షణ సౌకర్యాలు కల్పించలేక పోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత. ఓటు బాంకు కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్తితి ఇలాగే ఉంటుంది.ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు.అదికార దాహం తప్ప. మనం ఒక విషయం
ఆలోచిద్దాం.వైద్యుల నిర్లక్షం వల్ల మన బంధువులు ఎవరో చనిపోయారని అనుకుందాం. మన బంధువులను చంపడం వల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనం ఏంటి ? వాళ్ళు మనకు శత్రువులు కాదుగా ? ఒక వేళ నిజంగా వైద్యుల నిర్లక్ష వైకరి వల్ల మనకు అన్యాయం జరిగితే న్యాయ
వ్యవస్త ద్వారా పోరాటం చేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు దిగటం ఎంత వరకు సమంజసం. రోజూ ఒకో ఆసుపత్రిలో వైద్యుల ఫై దాడులు జరగటం, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల వాళ్ళు ఎలా పనిచేయగలరు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోదు.ఇంక వాళ్ళు
అనుభవించే మానసిక వేదన ఎవరితో చెప్పుకోగలరు. నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన పునరావృత్తం అయ్యేది కాదు. ఈ దాడులకు పూర్తి భాద్యత ప్రభుత్వానిదే.ఇప్పటి కైనా ప్రభుత్వం కళ్ళు తెరచి వైద్యుల రక్షణ చర్యలు చేపట్టవసిందిగా
కోరుతున్నాను.
ప్రత్యక్ష దాడుల వల్ల వేదనకు గురయిన నా వైద్య సోదర,సోదరీమాణుల తరపున ఆవేదనతో
మీ సోదరుడు,
బాపూజీ
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

No comments: