ప్రత్యేక తెలంగాణా నినాదంతో ముందుకు పోతున్న టి.ఆర్.ఎస్.పార్టీ తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో రాజీనామాలు చేయాలని తలపొస్తుంది.దానికి సంబందించిన తేదీని ఖరారు చేశారు.వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం మళ్లీ ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.దాని వల్ల ఎంతో ప్రజా ధనం వృధా అవుతుంది. ఓట్లేసి గెలిపిస్తే తమకెదొ న్యాయం చేస్తారని నమ్మి ఓట్లేసిన జనాన్ని పిచ్చోళ్లని చేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు ఈ విధంగా రాజీనామాల చేయడం దురధృష్టకరం. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. నాయకుల వైఖరి వల్ల కరీంనగర్ ఉపఎన్నిక జరిగింది. ఎంతో ప్రజా ధనం వృధా అయ్యింది. మళ్లీ అదే పునరావృత్తం అవుతుంది. ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే రాజీనామాల వల్ల జరిగే ఎన్నికల ఖర్చును వాళ్లే భరించే విధంగా ఎన్నికల కమీషన్ ఆంక్షలు విధించాలి. దానికి సంభందించిన న్యాయపరమైన జీవోను తీసుకురావాలి. టి.ఆర్.ఎస్. పార్టీ నినాదం ప్రత్యేక తెలంగాణా నే కావచ్చు.ప్రత్యేక తెలంగాణా సాధన కోసం మీరు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎవరికి అభ్యంతరం ఉండదు. నిరసన తెలపాలే కానీ రాజీనామాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం భాధాకరం.మనం చేసే ఏ నిరసన కార్యక్రమం వల్లనైనా ప్రజా ధనం వృధా కాకుండా చూసుకోవలసిన భాద్యత మనది। మనందరిది.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
Sunday, March 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment